ASHTADASA SAKTI PEETHALU
₹170 ₹120
తొలి రచన “వ్యాస విద్య”, మలి రచన “ద్వాదశజ్యోతిర్లింగ మాహాత్మ్యం” ద్వారా విశేష పాఠకాదరణ పొందిన రచయితగా పిన్న వయసులోనే ఖ్యాతి గడించిన రచయిత్రి శ్రీమతి శ్రీవిద్య, 18 శక్తిపీఠాలు ప్రస్తుతకాలంలో ఏ యే ప్రాంతాలలో ఉన్నాయో తెలియజేస్తూ, ఆయా క్షేత్రాలతో ముడివడియున్న గాథలను, స్థలమాహాత్మ్యాన్ని అక్కడ చేయవలసిన పూజాదికాల విశేషాలను బ్రహ్మాండాది పురాణాలనుండి ఎంతో భక్తితో, ఆసక్తితో, శ్రమకోర్చి సంగ్రహించి, శాస్త్రప్రామాణికంగా సరళమైన రీతిలో, ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన శైలిలో గ్రంథస్తం చేసి, తమ మూడవ రచన “అష్టాదశ శక్తిపీఠాలు” గా మనకు అందించారు. చదివి తరించండి
Availability: 2785 in stock
Short Description
బహుభాషా కోవిదులైన తమ తాతగారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి చలపతిరావుగారినుండి, త్రిభాషామహాసహస్రావధాని, అష్టాదశపురాణాలను అలవోకగా తమ ప్రవచనాలద్వారా భక్తకోటికి అందించే తమ తండ్రిగారైన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారినుండి లభించిన పురాణపరిజ్ఞానంతో, సరళమైన రచనాశైలితో ఆసక్తికరంగా తీర్చిదిద్ది, తమ తృతీయ రచన “అష్టాదశ శక్తిపీఠాలు” ద్వారా రచయిత్రి శ్రీమతి శ్రీవిద్య అందించిన అష్టాదశ పీఠముల ప్రామాణిక విశేషాలను చదివి ఆ జగన్మాత అనుగ్రహం సొంతం చేసుకోండి.
Related products
-
BOOKS
GARUDA PURANAM
₹375₹300 Add to cartనిరంతరం గరుత్మంతుని అధిరోహించి తిరిగే శ్రీమన్నారాయణుడు తన వాహనమైన గరుడునికి స్వయంగా ప్రవచించినదీ పురాణం.
గరుత్మంతుడు విష్ణువు యొక్క అంశ. అంటే భగవంతుడే భగవంతుడికి చెప్పిన పురాణం గరుడపురాణం.
-
BOOKS
NEELALANTHESWARA VAIBHAVAM
₹100₹60 Add to cart“నూనూగు మీసాల నూత్న యవ్వనంలో ఉన్న పద్మాకర్ గారి పై ఆ నీల కంఠుడి దివ్యదృష్టి ప్రసరించగానే, ఆయన నోటి వెంట అలవోకగా జాలువారినవే ఈ పుస్తకంలోని శివ లీలా విన్యాసాలు” అని శ్రీ శ్రీ శ్రీ గణపతి సచిదానందా స్వామీజీ స్వయంగా వర్ణించిన ఈ గ్రంధాన్ని మీరు చదివి తరించండి.
-
BOOKS
VYASA VIDYA & DWADASA JYOTIRLINGA MAHATMYAM
₹200₹150 Add to cartభారతదేశంలో పేరెన్నికగన్న శైవక్షేత్రాలలో మహామహిమాన్వితమైన స్వయంభూ లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు. జ్యోతిస్వరూపుడైన ఆ పరమేశ్వరుడే భక్తులను ఉద్ధరించడం కోసం ఆయా క్షేత్రాలలో లింగరూపంలో ఉద్భవించి కొలువై ఉన్నాడు.ఈ జ్యోతిర్లింగాలను దర్శించ లేకపోయినా వాటిని స్మరించినా, చదివినా శివానుగ్రహంతో ముక్తి పొందుతారని శివమహాపురాణం స్పష్టం చేస్తోంది.
కవి రాజశేఖర, త్రిభాషా మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి సుపుత్రి చి|| కుమారి శ్రీ విద్య అనన్య సామాన్యమైన రీతిలో ద్వాదశ జ్యోతిర్లింగములను మీకు అక్షర రూపంలో సాక్షాత్కరింప చేసిన, శివ భక్తులు తప్పక పఠించ వలసిన గ్రంథం.
-
BOOKS
SRIMADDEVI BHAGAVATHAM
₹475₹400 Add to cartభోగ మోక్షాలు రెండూ ఇచ్చే పురాణముగా పురాణ ప్రారంభంలో వేదవ్యాసుడే స్వయంగా వర్ణించిన “శ్రీమద్దేవీ భాగవతం” చదివిన వారికి ఇహము, పరము రెండూ లభిస్తాయి. చదవలేని వారు, చదివించుకొన్నా అదే ఫలితాన్ని పొందుతారు. మొత్తం చదవలేనివారు ఇందులోని శ్లోకం లేదా అర్థ శ్లోకం చదివినా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఏ ఇంట్లో దేవీ భాగవతము నిత్యం పూజింపబడుతుందో ఆ ఇల్లు మహాతీర్థం అవుతుంది. ఆ ఇంట్లో నివసించే వారికి సకల పాపాలు నశించిపోతాయి. అట్టి ఈ పవిత్ర గ్రంధాన్ని చదివి, చదివించుకొని తరించండి.
-
BOOKS
SRI VENKATESWARA VILASAM
₹200₹150 Add to cart“వినా వేంకటేశం ననాథో ననాథః”
కలియుగం లో భక్త జనోద్ధరణకే అవతరించిన శ్రీ వేంకటేశ్వరుడు సర్వదా, సర్వథా స్మరణీయుడు.
“పురాణాంతర్గత శ్రీ వేంకటాచల మహాత్మ్యం, పద్మపురాణం,వరాహ పురాణం ఇత్యాది గ్రంథాలు ఆధారంగా పండిత పామరులను అలరింపచేసే సరళ వ్యావహారిక శైలిలో, అష్టాదశ పురాణములపై తనకు గల సాధికారతను, ఆ ఏడు కొండల వానిపై తనకు గల అచంచల భక్తిని వ్యక్తం చేస్తూ రచయిత అందించిన ఈ ఆణిముత్యం, ఆధ్యాత్మిక పరిపూర్ణతకై తపించే వారు తప్పక చదవవలసిన గ్రంధం” అని ప్రముఖల ప్రశంసలు అందుకున్న ఈ రచనను మీరూ పఠించి స్వామి అనుగ్రహాన్ని పొందండి. -
BOOKS
AISWARYA YOGAM
₹325₹250 Add to cartనిజమునకు దైవానికి గుణ రూప కర్మాదులు లేవు. విశ్వమంతా వ్యాపించి యున్న ఆద్యంతములే లేని ఈ దైవ శక్తి కాల ధర్మాన్ని అనుసరించి శిష్ట రక్షణకు దుష్ట శిక్షణకు సదృశ రూపంతో దర్శనమిస్తుంది. అట్టి ఆ శక్తి రూపాలలో లలితా పరమేశ్వరి గా అమ్మవారి రూపం అమిత శక్తివంతము, కరుణ రస పూరితము అయినది. ఆ తాళి ప్రసాదించే విభూతుల సారమే ఈ గ్రంథం.
-
BOOKS
‘MAA’NAVA KATHA
₹230₹180 Add to cartపాండిత్యంలో గొప్పవారు సైతం గొప్పది అని కీర్తించిన పద్య కావ్యం మానవ కథనవ కథలు నేటి తరాలకు నవ నిధులు వంటివి. నవరసాలను కలబోసిన ఈ కథలు మన నిత్య జీవన శైలిని ఉన్నత మార్గమునకు మళ్లించగల మహిమాన్విత సందేశాలు.