ఒక దివ్య ముహూర్తాన అమ్మవారు స్వప్న దర్శనంలో ఇచ్చిన ఆజ్ఞను శిరసావహిస్తూ పూజ్య గురు దేవులు వ్యాసాంతరాత్మను తన అంతర్మాతలో కలుపుకొని, “శ్రీ మద్దేవీ భాగవత” పురాణ సుధా రసాన్ని సరళమైన భాషలో స్వేచ్ఛానువాదంగా భక్తులకు అందించారు.
“రాసింది రాయించింది అంతా అమ్మే” అని స్వయంగా పూజ్య గురుదేవులే ప్రకటించిన ఈ దివ్య పురాణం యొక్క మొదటి భాగం చదివి శ్రీ మాత అనుగ్రహానికి పాత్రులు కండి.
అత్యంత పవిత్ర పురాణం “శ్రీ మద్దేవీ భాగవతం” . ఈ గ్రంధాన్ని చదువలేక పోయిన వారు ఇంట పుజించినా అనేక శుభ ఫలితాలు పొందుతారు. కనుక ఈ మహాపవిత్ర గ్రంథాన్ని ఇంట ఉంచి పూజించి, ఇంటిని అమ్మవారి నివాసమైన మణిద్వీపంగా మార్చుకొని భక్తులందరూ తరించెదరుగాక!



