Sale!

VYASA VIDYA & DWADASA JYOTIRLINGA MAHATMYAM

Original price was: ₹200.Current price is: ₹150.

భారతదేశంలో పేరెన్నికగన్న శైవక్షేత్రాలలో మహామహిమాన్వితమైన స్వయంభూ లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు.  జ్యోతిస్వరూపుడైన ఆ పరమేశ్వరుడే భక్తులను ఉద్ధరించడం కోసం ఆయా క్షేత్రాలలో లింగరూపంలో ఉద్భవించి కొలువై ఉన్నాడు.ఈ జ్యోతిర్లింగాలను దర్శించ లేకపోయినా వాటిని స్మరించినా, చదివినా శివానుగ్రహంతో ముక్తి పొందుతారని శివమహాపురాణం స్పష్టం చేస్తోంది.

కవి రాజశేఖర, త్రిభాషా మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి సుపుత్రి చి|| కుమారి శ్రీ విద్య అనన్య సామాన్యమైన రీతిలో ద్వాదశ జ్యోతిర్లింగములను మీకు అక్షర రూపంలో సాక్షాత్కరింప చేసిన,  శివ భక్తులు తప్పక  పఠించ వలసిన గ్రంథం.

Availability: 436 in stock

పంథొమ్మిది  వ్యాసాలు ఉన్నఈ  సంపుటి లో  “చైత్రం” మొదలుకుని “ఫాల్గుణం” వరకు గల పన్నెండు మాసాలు ప్రాముఖ్యత,  ఆయా మాసాలతో ముడిపడియున్న అనాకానేక ముఖ్య అంశాలు  విశదీకరించబడ్డాయి.

ఈ గ్రంథంలో జ్యోతిర్లింగాల ఆవిర్భావ ఘట్టములు, క్షేత్రప్రశస్తి, పౌరాణిక గాధలు, మహిమలు సవివరముగా, సహేతుకంగా, సమగ్రంగా ఫలశ్రుతులతో పాటుగా ఏ జ్యోతిర్లింగాన్ని ఏ సమయంలో ఏ రీతిన అర్చించాలి, ఏ ఏ మాసాలలో, ఏ ఏ తిథులలో అర్చిస్తే సత్ఫలితాలు లభిస్తాయి వంటి అనేక విషయాలు రమణీయంగా ఆవిష్కరింప బడ్డాయి. శివ మహిమల పై సంపూర్ణ అవగాహన పొంది  తద్వారా పరమేశ్వరుని అనుగ్రహమునకు పాత్రులు కాదలచిన వారందరు చదివి తీరవలసిన గ్రంథం.

 

Weight 0.1 kg
Dimensions 20 × 15 × 5 cm