శ్రీ వ్యాసవిద్య అనే గ్రంథం ఆంధ్ర భాషాభూషణ, అభినవశుక, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి కుమార్తె కుమారి వద్దిపర్తి శ్రీవిద్య రచించారు.
పంథొమ్మిది వ్యాసాలు ఉన్నఈ సంపుటి లో “చైత్రం” మొదలుకుని “ఫాల్గుణం” వరకు గల పన్నెండు మాసాలు ప్రాముఖ్యత, ఆయా మాసాలతో ముడిపడియున్న అనాకానేక ముఖ్య అంశాలు విశదీకరించబడ్డాయి.
సామాజికస్పృహ కల్గించే అంశాలను, వివిధ గ్రంథములు, పురాణాల లోని ప్రామాణిక పద్యాలు, శ్లోకాలతో సమన్వయపరుస్తూ కుమారి శ్రీవిద్య చక్కని శైలిలో వ్యాసాలు అందించారు.
శ్రీ దత్తవిజ్ఞానందతీర్థ స్వామీజీ వారితో పాటు ప్రముఖులెందరో కుమారి శ్రీవిద్యకు తమ అభినందనలతో పాటు ఆశీస్సులూ ఆందించారు.




