VYASA VIDYA & DWADASA JYOTIRLINGA MAHATMYAM
₹200 Original price was: ₹200.₹150Current price is: ₹150.
పంథొమ్మిది వ్యాసాలు ఉన్నఈ సంపుటి లో “చైత్రం” మొదలుకుని “ఫాల్గుణం” వరకు గల పన్నెండు మాసాలు ప్రాముఖ్యత, ఆయా మాసాలతో ముడిపడియున్న అనాకానేక ముఖ్య అంశాలు విశదీకరించబడ్డాయి.
ఈ గ్రంథంలో జ్యోతిర్లింగాల ఆవిర్భావ ఘట్టములు, క్షేత్రప్రశస్తి, పౌరాణిక గాధలు, మహిమలు సవివరముగా, సహేతుకంగా, సమగ్రంగా ఫలశ్రుతులతో పాటుగా ఏ జ్యోతిర్లింగాన్ని ఏ సమయంలో ఏ రీతిన అర్చించాలి, ఏ ఏ మాసాలలో, ఏ ఏ తిథులలో అర్చిస్తే సత్ఫలితాలు లభిస్తాయి వంటి అనేక విషయాలు రమణీయంగా ఆవిష్కరింప బడ్డాయి. శివ మహిమల పై సంపూర్ణ అవగాహన పొంది తద్వారా పరమేశ్వరుని అనుగ్రహమునకు పాత్రులు కాదలచిన వారందరు చదివి తీరవలసిన గ్రంథం.
Availability: 510 in stock
Short Description
భారతదేశంలో పేరెన్నికగన్న శైవక్షేత్రాలలో మహామహిమాన్వితమైన స్వయంభూ లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు. జ్యోతిస్వరూపుడైన ఆ పరమేశ్వరుడే భక్తులను ఉద్ధరించడం కోసం ఆయా క్షేత్రాలలో లింగరూపంలో ఉద్భవించి కొలువై ఉన్నాడు.ఈ జ్యోతిర్లింగాలను దర్శించ లేకపోయినా వాటిని స్మరించినా, చదివినా శివానుగ్రహంతో ముక్తి పొందుతారని శివమహాపురాణం స్పష్టం చేస్తోంది.
కవి రాజశేఖర, త్రిభాషా మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి సుపుత్రి చి|| కుమారి శ్రీ విద్య అనన్య సామాన్యమైన రీతిలో ద్వాదశ జ్యోతిర్లింగములను మీకు అక్షర రూపంలో సాక్షాత్కరింప చేసిన, శివ భక్తులు తప్పక పఠించ వలసిన గ్రంథం.
Related products
-
BOOKS
SIVAPURANAM-2
₹175Original price was: ₹175.₹120Current price is: ₹120. Add to cartవేదవ్యాసమహర్షి రచించిన అష్టాదశపురాణాలలో నాలుగవది “శివపురాణం”.ఈ శివపురాణంలో ఏడు సంహితలు ఉన్నాయి.మొదటి భాగంలో విద్యేశ్వరసంహిత, రుద్రసంహితలోని “సృష్టిఖండం , సతీఖండం” అనబడే మొదటి రెండు ఖండాలను సులభమైన శైలిలో పాఠకులకు అందించిన సద్గురువులు బ్రహ్మశ్రీ పద్మాకర్ గారు తరువాయి భాగాలను ఈ గ్రంధంలో అంధించారు. భయంకర పాపాలనుండి విముక్తిని ప్రసాదించే ఈ గ్రంథం చదివి తరించండి.
-
BOOKS
SRI KARTIKA PURANAM
₹260Original price was: ₹260.₹200Current price is: ₹200. Add to cartఈ పురాణం లోని 30 కథలను రోజుకు ఒక్కొక్క కథ చొప్పున పారాయణ చేయండి. శివపార్వతులను, లక్ష్మీనారాయణులను ఒక్క త్రాసులో ఉంచి, బంగారంతో తూచి, ఆ బంగారాన్ని దానం చేసిన మహా ఫలితం పొందుతారు.
-
BOOKS
ASHTADASA SAKTI PEETHALU
₹170Original price was: ₹170.₹120Current price is: ₹120. Add to cartబహుభాషా కోవిదులైన తమ తాతగారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి చలపతిరావుగారినుండి, త్రిభాషామహాసహస్రావధాని, అష్టాదశపురాణాలను అలవోకగా తమ ప్రవచనాలద్వారా భక్తకోటికి అందించే తమ తండ్రిగారైన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారినుండి లభించిన పురాణపరిజ్ఞానంతో, సరళమైన రచనాశైలితో ఆసక్తికరంగా తీర్చిదిద్ది, తమ తృతీయ రచన “అష్టాదశ శక్తిపీఠాలు” ద్వారా రచయిత్రి శ్రీమతి శ్రీవిద్య అందించిన అష్టాదశ పీఠముల ప్రామాణిక విశేషాలను చదివి ఆ జగన్మాత అనుగ్రహం సొంతం చేసుకోండి.
-
BOOKS
SRIMADDEVI BHAGAVATHAM
₹475Original price was: ₹475.₹400Current price is: ₹400. Add to cartభోగ మోక్షాలు రెండూ ఇచ్చే పురాణముగా పురాణ ప్రారంభంలో వేదవ్యాసుడే స్వయంగా వర్ణించిన “శ్రీమద్దేవీ భాగవతం” చదివిన వారికి ఇహము, పరము రెండూ లభిస్తాయి. చదవలేని వారు, చదివించుకొన్నా అదే ఫలితాన్ని పొందుతారు. మొత్తం చదవలేనివారు ఇందులోని శ్లోకం లేదా అర్థ శ్లోకం చదివినా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఏ ఇంట్లో దేవీ భాగవతము నిత్యం పూజింపబడుతుందో ఆ ఇల్లు మహాతీర్థం అవుతుంది. ఆ ఇంట్లో నివసించే వారికి సకల పాపాలు నశించిపోతాయి. అట్టి ఈ పవిత్ర గ్రంధాన్ని చదివి, చదివించుకొని తరించండి.
-
BOOKS
SRI VENKATESWARA VILASAM
₹200Original price was: ₹200.₹150Current price is: ₹150. Add to cart“వినా వేంకటేశం ననాథో ననాథః”
కలియుగం లో భక్త జనోద్ధరణకే అవతరించిన శ్రీ వేంకటేశ్వరుడు సర్వదా, సర్వథా స్మరణీయుడు.
“పురాణాంతర్గత శ్రీ వేంకటాచల మహాత్మ్యం, పద్మపురాణం,వరాహ పురాణం ఇత్యాది గ్రంథాలు ఆధారంగా పండిత పామరులను అలరింపచేసే సరళ వ్యావహారిక శైలిలో, అష్టాదశ పురాణములపై తనకు గల సాధికారతను, ఆ ఏడు కొండల వానిపై తనకు గల అచంచల భక్తిని వ్యక్తం చేస్తూ రచయిత అందించిన ఈ ఆణిముత్యం, ఆధ్యాత్మిక పరిపూర్ణతకై తపించే వారు తప్పక చదవవలసిన గ్రంధం” అని ప్రముఖల ప్రశంసలు అందుకున్న ఈ రచనను మీరూ పఠించి స్వామి అనుగ్రహాన్ని పొందండి. -
Sale!
Out of stock
BOOKSVYASA VIDYA
₹120Original price was: ₹120.₹75Current price is: ₹75. Read more“చైత్రం” మొదలుకుని “ఫాల్గుణం” వరకు గల పన్నెండు మాసముల ప్రాముఖ్యత, ఆయా మాసాలతో ముడిపడియున్న అనేకానేక ముఖ్యాంశాలను స్పృశిస్తూ పాఠకులకు అమూల్యపురాణ జ్ఙానసంపదను అందించే ఈ గ్రంధమును తప్పక చదవండి.
-
BOOKS
‘MAA’NAVA KATHA
₹230Original price was: ₹230.₹180Current price is: ₹180. Add to cartపాండిత్యంలో గొప్పవారు సైతం గొప్పది అని కీర్తించిన పద్య కావ్యం మానవ కథనవ కథలు నేటి తరాలకు నవ నిధులు వంటివి. నవరసాలను కలబోసిన ఈ కథలు మన నిత్య జీవన శైలిని ఉన్నత మార్గమునకు మళ్లించగల మహిమాన్విత సందేశాలు.